📄 ePaper
Tuesday, February 3, 2026
📄 ePaper

దొంగతనపు కేసు పసిగట్టి ఇద్దరు అరెస్ట్

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

ప్రజలను వేధించే వారిపై కఠిన హెచ్చరిక

ఆదిలాబాద్, జూన్ 9, 2025  :  మవాలా పోలీస్ స్టేషన్, ఆదిలాబాద్ జిల్లా పోలీసులు హరితవనం పార్కులో జరిగిన  దొంగతనాన్ని విజ‌య‌వంతంగా పసిగట్టి, ఇందులో పాల్గొన్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులు *కారం సంతోష్ (34) మరియు పల్లపు దుర్గయ్య (59)*  లను ఘటన జరిగిన 24 గంటల్లోపు అరెస్ట్ చేయడంలో పోలీసులు సఫలమయ్యారు.

ఈ ఘటన జూన్ 8, 2025 మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో హరితవనం పార్కులో చోటుచేసుకుంది. బాధితురాలు దత్రక్ సంజీవిత మరియు ఆమె భర్త కమలేశ్వర్ అక్కడ విహరిస్తుండగా, ఇద్దరు అపరిచితులు వారిని అడ్డగించి, భర్తను మానసికంగా బెదిరించి, శారీరకంగా దాడి చేసి, రూ.5000/- నగదు లూటీ చేశారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు మవాలా పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసి, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 309(6) ప్రకారం విచారణ ప్రారంభించారు. విశ్వసనీయ సమాచార ఆధారంగా ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ *కె. స్వామి* గారి నాయకత్వంలో పోలీసులు నిందితులను విద్యానగర్ బస్టార్డు ప్రాంతంలో పట్టుకున్నారు.

ప్రారంభ విచారణలో నిందితులు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. వారి వద్ద న్యాయసాక్షుల సమక్షంలో జరిగిన పంచనామా ద్వారా ఒక్కొక్కరి వద్ద రూ.500/- చొప్పున మొత్తంగా రూ.1000/-ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా డబ్బును మద్యం కోసం ఖర్చు చేశామని వారు వెల్లడించారు. ఇద్దరు నిందితులను 15 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్  తరలించి, పూర్తి చార్జ్‌షీట్ రూపొందించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇందులో ప్రధాన నిందితుడైన కారం సంతోష్కు గతంలో కూడా నేర చరిత్ర ఉన్నట్టు తెలిసింది.

*ఇలాంటి వారిపై హెచ్చరిక:*

ఆదిలాబాద్ పోలీసులు, ప్రజా స్థలాలు, పార్కులు, ప్రైవేట్ ప్రదేశాలు లేదా వాహనాలను అడ్డగించి డబ్బు దోచే క్రియాకలాపాల్లో పాల్గొనే వ్యక్తులపై కఠిన హెచ్చరిక జారీచేస్తున్నారు.

ఈ తరహా నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠినంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. పునరావృత నేరాల చరిత్ర గల వ్యక్తులపై ‘రోడీ షీట్లు’ తెరిచి, కఠిన నిఘా పెట్టడం, నిరోధక చట్టపరమైన చర్యలు ప్రారంభించడం జరుగుతుంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పదమైన ఘటనలు, వేధింపులు, డబ్బు వసూలు ప్రయత్నాలు, దొంగతనాల సమాచారం సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీస్ హెల్ప్‌లైన్‌కి వెంటనే అందించగలరని పోలీస్ శాఖ కోరుతోంది. ప్రతి ఒక్కరి సహకారం ద్వారా సమాజంలో భద్రత, శాంతిని నెలకొల్పవచ్చు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!