ఆర్థిక సాయం కోరుతున్న రైతులు
రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : బజార్ హత్నూర్ మండలం, బుర్కపల్లి గ్రామంలో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. రోజువారీగా మేతకు వెళ్లిన 20 ఆవులు జొన్న లేత మొలకలు (లాప) తినడం వల్ల మృతి చెందాయి. ఈ విషయం తెలుసుకున్న మండల రెవెన్యూ అధికారి గిరిదావర్ రాథోడ్ నూర్ సింగ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి, గ్రామ రైతులతో మాట్లాడారు. జొన్న లేత మొలకలు మేయడం వల్ల ఆవులు మరణించినట్లు రైతులు తెలిపారు.
మరణించిన ఆవుల యజమానుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
- బర్ధవాల్ నానాక్ సింగ్ – 3 ఆవులు
- టాక్ డా నానాక్ సింగ్ – 4 ఆవులు
- మాటవాన్ గులాబ్ సింగ్ – 1 ఆవు
- సబడే చందర్ సింగ్ – 1 ఆవు
- బర్ధవాల్ గురువే సింగ్ – 1 ఆవు
- జాతీవే న్యాల్ సింగ్ – 1 ఆవు
- జాతీవే సుభాష్ – 1 ఆవు
- నిస్తే హుషార్ సింగ్ – 2 ఆవులు
- బనియ రామ్ – 1 ఆవు
- భామన్ పర్షు రామ్ – 1 ఆవు
- బస్సి హర్ సింగ్ – 1 ఆవు
- మాటవాన్ కాపుర్ చందు – 2 ఆవులు
- మాటవాన్ గోపి చందు – 1 ఆవు
మొత్తం 13 మంది రైతులకు చెందిన 20 ఆవులు మరణించాయి. ఒక్కో ఆవు సుమారు 20,000 రూపాయల విలువైనదని, మొత్తం 4 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. తమ జీవనాధారమైన ఆవులను కోల్పోయిన రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.
రైతులు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు. అధికారులు సంఘటనపై విచారణ జరుపుతున్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments