ePaper
Sunday, February 15, 2026
📄 ePaper

వైభవంగా ముగిసిన దివ్య శ్రీ గో కృప కథ.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!



ఇచ్చోడ/మాధాపూర్, (తేదీ: 15-02-2026) : ఆదిలాబాద్ జిల్లా, ఇచ్చోడ మండలం, మాధాపూర్ గ్రామంలోని శ్రీ ప్రతి భగవాన్ గఢ్‌లో గత వారం రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్న ‘దివ్య శ్రీ గో కృప కథ’ సప్తాహ జ్ఞాన యజ్ఞం ఆదివారం (నేడు) ఘనంగా ముగిసింది. మహంత్ న్యాయాచార్య హ.భ.ప. నామ్‌దేవ్ శాస్త్రి మహారాజ్ గారి కృపాశీర్వాదములతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.


భక్తి పారవశ్యంలో మాధాపూర్:
గత ఏడు రోజులుగా (ఫిబ్రవరి 9 నుండి 15 వరకు) పూజ్య సాధ్వి కపిలా గోపాల్ సరస్వతి దీదీజీ తన మధురమైన స్వరంతో గోవు యొక్క విశిష్టతను, హైందవ ధర్మంలో గోమాతకు ఉన్న ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు. నేడు చివరి రోజు కావడంతో పరిసర ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భక్తుల రాకతో మాధాపూర్ జనసంద్రంగా మారింది. దీదీజీ ప్రవచనాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.


రేపు ‘కాల కీర్తన’ మహోత్సవం:
వారోత్సవాల్లో భాగంగా, రేపు సోమవారం (16-02-2026) ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు హ.భ.ప. శ్రీ కృష్ణ మహారాజ్ శాస్త్రి గారిచే “కాల కీర్తన” కార్యక్రమం నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు.


పాల్గొన్న ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీ సూర్యకాంత్ గీతే, కమిటీ సభ్యులు, మాధాపూర్ మరియు పట్వారిగూడ గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. కథా శ్రవణం అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!