ఏపీలో పేదలకు జగన్ సర్కార్ మరో శుభవార్త..

📰 Generate e-Paper Clip

ఏపీలో పేదలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. పేదలకు ఇచ్చిన ఇంటి స్థలానికి పదేళ్ల అనంతరం భూ యాజమాన్య హక్కు కల్పించే సవరణ బిల్లును మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రవేశపెట్టారు.

దీనివల్ల ప్రభుత్వం మహిళల పేరిట ఇచ్చిన ఇంటి స్థలంలో ఇల్లు నిర్మించుకొని.. పదేళ్ల తర్వాత అమ్ముకునేందుకు వీలుంటుందని మంత్రి తెలిపారు. ఈ బిల్లుకు ఆమోదం లాంఛనమే అని చెప్పాలి. మరోవైపు అసెంబ్లీలో మరో బిల్లును కూడా ప్రవేశపెట్టారు.

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు, ఇతర విధానాల్లో చేరిన వారిలో క్రమబద్ధీకరణ పొందిన ఉద్యోగులకు.. అంతకు ముందున్న సర్వీసును పింఛను ప్రయోజనాలకు లెక్కించకూడదనే సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి దీన్ని ప్రవేశపెట్టారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఈ సవరణ చేసినట్లు ఆయన తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments