ఉదయం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ….. రాత్రి దొంగలు రేకులు కట్ చేసి దోచేశారు…
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్రెండ్
- మందు బాటిళ్లు , నగదు దోచుకెళ్లిన దొంగలు
- నెలల వ్యవధిలోనే మరో దొంగతనం …
- రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ (డిసెంబర్ 12 ): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. తాజాగా మండలంలోని అలెగామ ( కే) గ్రామ శివారంలో గల మూడు మద్యం దుకాణాల్లో గురువారం తెల్లవారు జామున దొంగలు చోరికి పాల్పడ్డారు . స్థానిక ఎస్ఐ ఉదయ్ కుమార్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి , కొత్తగా వెలసిన శ్రీ రాజ రాజేశ్వర , సిద్ధి వినాయక , లక్ష్మీ వైన్స్ల లో గుర్తు తెలియని దుండగులు వరుస చోరీలకు పాల్పడ్డారు . మూడు వైన్ షాపులా పై భాగంలో గల రేకులను ఒక పక్కకు తీసి లోపల చొరపడ్డారు . దొంగలు పక్క ప్రణాళిక ప్రకారం మద్యం , వాటిళ్లు , నగదును దోచుకెళ్లారు . మూడు మద్యం దుకాణాల్లో సుమారు రూ . 20 వేలు , రూ . పదిహేను వేల విలువ గల మద్యం బాటిళ్లు అపహరించారు . దొంగల మొఖాలు సీసీ కెమెరాలలో రొకార్డు కాకుండా వాటిని ధ్వంసం చేశారు . సీసీ కెమెరాలకు సంబంధించిన హర్డు డిస్కులు, సుమారు రూ . 30 వేల విలువ గల రెండు ఎల్ఈడీ టీవీలను దోనగలు ఎత్తుకెళ్లి పారిపోయారని తెలిపారు . వైన్స్ యజమానులు దొంగతనం గురించి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలాలను ఎస్సైలు ఉదయ్ కుమార్ , రాకేష్ లు పరిశీ లించారు . ఆదిలాబాద్ నుంచి క్లూస్ టీమ్ లను రప్పించి , వేలి ముద్రలను సేకరించారు . దుకాణాల యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని , దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments