Wednesday, October 15, 2025

సరైన పత్రాలు లేకుండా బియ్యం తరలిస్తున్న లారీ పట్టివేత…..

రిపబ్లిక్ హిందుస్ధాన్ , ఇచ్చోడ : ఇచ్చోడ మండల కేంద్రంలో ఓ లారీలో సరైన పత్రాలు లేకుండా , పిడిఎస్ బియ్యం ఉన్న సంచులు చింపి వేరే సంచుల్లో లోడ్ చేసిన లారీని పోలీసులు అదుపులో తీసుకున్నారు. కోవిడ్ సంకటం లో వేలం వేసిన బియ్యం అని డిటిడబ్య్లుఓ కంప్యూటర్ ఆపరేటర్ ఓ జిరాక్స్ లెటర్ ను ఇచ్చారు. అయితే ఆ లెటర్ లో మాత్రం టెండర్ పిలుస్తున్నట్లు ఉంది.

Thank you for reading this post, don't forget to subscribe!
లారీ డ్రైవర్ వద్ద ఉన్న లెటర్, డిటిడబ్య్లు ఓ ఆఫీసు కంప్యూటర్ ఆపరేటర్ ఇచ్చిన లెటర్

కానీ ఇదే అనుమతి పత్రం అని పేర్కొనడం గమనార్హం. క్వింటాల బియ్యం అని ఉండగా లారీలో సుమారు 170 క్వింటాలుకు పైగా బియ్యం ఉందని డ్రైవర్ తెలిపారు. ఆగస్టు నెలలో ఆ బియ్యం టెండర్ లో దక్కించుకున్నట్లు ఆఫీసులో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ పాల్ పేర్కొంటున్నారు. అయితే సంచులు చింపి ఎక్కడో జరిగిన టెండర్ బియ్యం ఇచ్చోడాలో ఓ గోదాములో ఎలా ప్రత్యేకం అయిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇది చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజల నుండి కొనుగోలు చేసిన బియ్యమని అంటున్నారు. ఇక్కడ స్థానిక ఇద్దరు ముగ్గురు వ్యాపారులు ఇదంతా నడిపిస్తున్నారని అంటున్నారు.

ప్రభుత్వం నుండి సప్లై చేసే సంచుల నుండి వేరే సంచుల్లో నింపిన బియ్యం

రేపు విచారణ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తాం…..

విచారణ చేసి రేపు పూర్తి వివరాలు వివరిస్తామని ఇచ్చోడ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు , ఎస్సై ఫరీద్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!