రిపబ్లిక్ హిందూస్థాన్,గుడిహత్నూర్:
నాబార్డు వారి ఆర్థిక సహకారంతో ఏకలవ్య ఫౌండేషన్ మరియు డ్రీమ్ సొసైటీ ఆధ్వర్యంలో గుడిహత్నూర్ మండలం,గర్కంపెట్ గ్రామపంచాయతీ పరిధిలోని సోమార్ పెట్ గ్రామానికి చెందిన రహదారి బ్రిడ్జి నిర్మాణ ప్రారంభ కార్యక్రమాన్ని గురువారం రోజు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లా (నాబార్డు,డిడిఎం) డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ అధికారులు తేజ్ రెడ్డి,మరియు అబ్దుల్ రావుఫ్ ల చేతుల మీదుగా బ్రిడ్జి పనులు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కాశీనాథ్ రెడ్డి, (ఏకలవ్య ఫౌండేషన్ సెక్రెటరీ) భవాని సింగ్(ట్రస్టీ),దిగంబర్(ట్రస్టీ), రామ్ రెడ్డి(ట్రస్టీ – ఆదిలాబాద్) మహేష్ చారి (సి.ఓ.ఓ ఆదిలాబాద్),కృష్ణారెడ్డి (డ్రీం సొసైటీ చైర్మన్) మధుకర్ (అడ్మిన్ – హైదరాబాద్) ముత్యం (ప్రాజెక్ట్ మేనేజర్) సంతోష్, రాహుల్ (కో ఆర్డినేటర్లు) శంకర్ (డాక్యుమెంటేషన్), సోమార్ పేట్ గ్రామ సర్పంచ్ కేశవ్,టేకం బాపూరావు,మడావి ఆనంద్ రావు, టేకం సుశీల,మడావి అయ్యుబాయి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Recent Comments