Friday, February 7, 2025

ఏకలవ్య ఫౌండేషన్,డ్రీమ్ సొసైటీ ఆధ్వర్యంలో బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం

రిపబ్లిక్ హిందూస్థాన్,గుడిహత్నూర్:
నాబార్డు వారి ఆర్థిక సహకారంతో ఏకలవ్య ఫౌండేషన్ మరియు డ్రీమ్ సొసైటీ ఆధ్వర్యంలో గుడిహత్నూర్ మండలం,గర్కంపెట్ గ్రామపంచాయతీ పరిధిలోని సోమార్ పెట్ గ్రామానికి చెందిన రహదారి బ్రిడ్జి నిర్మాణ ప్రారంభ కార్యక్రమాన్ని గురువారం రోజు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లా (నాబార్డు,డిడిఎం) డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ అధికారులు తేజ్ రెడ్డి,మరియు అబ్దుల్ రావుఫ్ ల చేతుల మీదుగా బ్రిడ్జి పనులు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కాశీనాథ్ రెడ్డి, (ఏకలవ్య ఫౌండేషన్ సెక్రెటరీ) భవాని సింగ్(ట్రస్టీ),దిగంబర్(ట్రస్టీ), రామ్ రెడ్డి(ట్రస్టీ – ఆదిలాబాద్) మహేష్ చారి (సి.ఓ.ఓ ఆదిలాబాద్),కృష్ణారెడ్డి (డ్రీం సొసైటీ చైర్మన్) మధుకర్ (అడ్మిన్ – హైదరాబాద్) ముత్యం (ప్రాజెక్ట్ మేనేజర్) సంతోష్, రాహుల్ (కో ఆర్డినేటర్లు) శంకర్ (డాక్యుమెంటేషన్), సోమార్ పేట్ గ్రామ సర్పంచ్ కేశవ్,టేకం బాపూరావు,మడావి ఆనంద్ రావు, టేకం సుశీల,మడావి అయ్యుబాయి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!