Thank you for reading this post, don't forget to subscribe!
గుడిహత్నూర్ మండల కేంద్రం లో ప్రయాణ ప్రాంగణం ఎదుట NH44 రహదారిలో లింగాపూర్ గ్రామస్తులు ధర్నా చేపట్టారు.లింగాపూర్ వెళ్లే దారిలో అక్రమంగా ఇల్లు నిర్మించడం వలన వాహన రాకపోకలకు కూడా మార్గం లేదని వాపోయారు.ఇంటిని తొలగించాలని లింగాపూర్ గ్రామస్థులు 2గంటల నుండి రహదారి లో రాస్తారోకో చేపట్టారు. ధర్నా విరమించండి అని అధికారులు ఎందరో సముదయించిన వినకుండా గ్రామస్థులు మొండికేశారు.కలెక్టర్ వచ్చేవరకు ఇలాగే రాస్తారోకో చేస్తామని అన్నారు.పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన కారులను చెదరగొట్టారు.


Recent Comments