Tuesday, October 14, 2025

పదోన్నతి పొందిన రాథోడ్ శ్రావణ్ కు ఘన సన్మానం



ఆదిలాబాద్ : గుడిహత్నూర్ మండలంలోని  ప్రభుత్వ జూనియర్ కళాశాల గుడిహత్నూర్ లో విధులు నిర్వహిస్తూ,  ఇటీవల సహాయ ఆచార్యునిగా పదోన్నతి  పై  ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్స్ ఆదిలాబాదుకు వెళ్లినా రాథోడ్ శ్రావణ్ కు  గుడిహత్నూర్ కళాశాల ప్రిన్సిపాల్ , భోధన  బోధనేతర సిబ్బంది  ఘనంగా సన్మానించారు.
పదోన్నతి పొందిన రాథోడ్ శ్రావణ్
కు ఆత్మియ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.

Thank you for reading this post, don't forget to subscribe!

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డి.శ్రీనివాస్ 
మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగికి పదోన్నతి,  సహజమని అన్నారు.

రాథోడ్ శ్రావణ్  తన యొక్క విధి నిర్వహణలో  భాగంగా విద్యార్థిని విద్యార్థులను నాణ్యమైన విద్యను భోధిస్తూ,
అంకిత భావంతో విధులు నిర్వహించారని వారి సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు  భోధన, బోధనేతర సిబ్బంది
విద్యార్థిని, విద్యార్థులు పాల్గోన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!