ఆదిలాబాద్ : గుడిహత్నూర్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గుడిహత్నూర్ లో విధులు నిర్వహిస్తూ, ఇటీవల సహాయ ఆచార్యునిగా పదోన్నతి పై ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్స్ ఆదిలాబాదుకు వెళ్లినా రాథోడ్ శ్రావణ్ కు గుడిహత్నూర్ కళాశాల ప్రిన్సిపాల్ , భోధన బోధనేతర సిబ్బంది ఘనంగా సన్మానించారు.
పదోన్నతి పొందిన రాథోడ్ శ్రావణ్
కు ఆత్మియ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డి.శ్రీనివాస్
మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగికి పదోన్నతి, సహజమని అన్నారు.
రాథోడ్ శ్రావణ్ తన యొక్క విధి నిర్వహణలో భాగంగా విద్యార్థిని విద్యార్థులను నాణ్యమైన విద్యను భోధిస్తూ,
అంకిత భావంతో విధులు నిర్వహించారని వారి సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు భోధన, బోధనేతర సిబ్బంది
విద్యార్థిని, విద్యార్థులు పాల్గోన్నారు.
Recent Comments