Wednesday, October 15, 2025

మిషన్ భగీరథ పై నేడు సీఎం సమీక్ష సమావేశం

Thank you for reading this post, don't forget to subscribe!

హైదరాబాద్‌:ఫిబ్రవరి 22
మిషన్‌ భగీరథపై ముఖ్య మంత్రి రేవంత్‌ రెడ్డి ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించ నున్నారు.

వేసవి ప్రారంభమవడంతో మంచినీటి సరఫరా, రిజర్వాయర్లు, పెండింగ్‌ బిల్లులు, పనులు తదితర అంశాలపై సమీక్షించను న్నారు.

గ్రామాల్లో నీటి సరఫరాపై ప్రభుత్వం ఇప్పటికే పంచా యతీ కార్యదర్శుల నుంచి సమాచారం సేకరి స్తున్నది.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మిషన్‌ భగీరథ ప్రాజెక్టు నిర్వహణ గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వ ర్యంలో ఉన్న విషయం తెలిసిందే.

అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇటీవల దానిని పంచాయ తీలకు అప్పగించింది. ఈ నేపథ్యంలోఈరోజు సీఎం సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించు కున్నది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!