సొంత భార్యను ఇంకొకడికి ఇచ్చి పెళ్లి చేశాడు..

📰 Generate e-Paper Clip

కలియుగం కలికాలం అంటే ఇదేనేమో… ఏదైనా జరగకూడనిధి జరిగితే ఎందుకు రిస్క్ అనుకున్నాడో ఏమో… యూపీలో ఓ వ్యక్తి తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో ఆమె పెళ్లి చేసి వారిద్దరిని ఒక్కటి చేశాడు. ఈ మధ్య భార్యల చేతిలో భర్తలు హత్యలకు గురవుతున్న సంఘటనలు అనేకం వస్తున్నాయి… ఈ స్టోరీ చదివి మీ అభిప్రాయం కామెంట్ లో రాయండి..

ఉత్తర్ ప్రదేశ్, ఇంటర్నెట్ డెస్క్:  ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఒక అసాధారణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక భర్త తన భార్యను ఆమె ప్రియుడితో వివాహం చేసి, వారి ఇద్దరు పిల్లల బాధ్యతను తానే స్వీకరించాడు. ఈ సంఘటన గురించి వివరాలు తెలుస్తే, బబ్లూ అనే వ్యక్తి తన పని రీత్యా తరచుగా ఇంటికి దూరంగా ఉండేవాడు. ఈ సమయంలో అతని భార్య రాధిక స్థానిక యువకుడైన వికాస్‌తో సన్నిహిత సంబంధాన్ని పెంచుకుంది.



బబ్లూ ఒకసారి ఊహించని విధంగా ఇంటికి వచ్చినప్పుడు, రాధిక మరియు వికాస్‌ను అనుమానాస్పద పరిస్థితిలో చూశాడు. ఈ విషయం తెలిసిన తర్వాత, అతను రాధికను నిలదీసి ఆమెకు రెండు ఎంపికలు ఇచ్చాడు – ఒకటి తనతో కలిసి జీవించడం లేదా రెండవది ఆమె ప్రియుడితో వెళ్లడం. రాధిక తన ప్రియుడు వికాస్‌ను ఎంచుకుంది. దీంతో బబ్లూ ఒక అరుదైన నిర్ణయం తీసుకున్నాడు. అతను గ్రామస్తుల సమక్షంలో రాధిక మరియు వికాస్‌ల వివాహాన్ని జరిపించాడు.

అంతేకాకుండా, బబ్లూ తన ఇద్దరు పిల్లల బాధ్యతను తానే తీసుకుంటానని, రాధికను వికాస్‌ తో సంతోషంగా జీవించమని చెప్పాడు.

“తుమ్ జావో, బచ్చోం కో మైం ఖుద్ పాల్ లూంగా” Tum jao baccho ko mai dekh lunga (నీవు వెళ్లు, పిల్లలను నేను స్వయంగా పెంచుకుంటాను) అని అతను రాధికతో అన్నాడు. ఈ ఘటన ధనఘట థానా పరిధిలోని కటార్ జోత్ గ్రామంలో జరిగింది.

ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికంగా గుండెల్ని కదిలించే చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లో ఈ వార్త వైరల్‌గా మారి, సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ప్రజలు బబ్లూ యొక్క ఈ నిర్ణయాన్ని ఆశ్చర్యంగా చూస్తూ, అతని త్యాగాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ సంఘటన ఇప్పుడు యూపీలో హట్ టాపిక్‌గా నిలిచింది.

#UttarPradesh #marriage #LatestNews #viralnews

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments