Sunday, May 18, 2025

మాజీ మంత్రి రజిని పై మరో కేసు..!?

అమరావతి : మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజినిపై పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. గతంలో ఆమె అక్రమాలను ప్రశ్నించిందుకు తన ఇంటిపై దాడి చేశారని, తన కుటుంబాన్ని మానసి కంగా హింసించారని చిలకలూరిపేటకు చెందిన రావు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇప్పటికే స్టోన్క్రషర్స్యజమానిని బెదిరించి డబ్బుగుంజారనే ఆరోపణలతో రజిని, మరో నలుగురిపై ఏసీబీ (ACB) కేసు నమోదు చేసింది.

ఆ కేసులో రజిని ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. నిన్న ఆ కేసు విచారణకు రాగా న్యాయస్థానం విచారణ ఏప్రిల్‌ 2కి వాయిదా వేసింది.

పల్నాడు జిల్లా యడ్లపాడు లోని లక్ష్మీబాలాజి స్టోన్‌ క్రషర్స్‌కు చెందిన నల్లపనేని చలపతిరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈకేసు నమోదు చేశారు. తాజాగా ఆమెపై మరో ఫిర్యాదు అందడం కలకలం రేకెత్తిస్తోంది. 2022 ఏప్రిల్లో రజిని మనుషులు తన ఇంటిపైకి వచ్చి దాడి చేశారని, ఇంట్లో వారిని భయభ్రాంతులకు గురి చేశారని సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు.

అప్పట్లోనే తాను ఫిర్యాదు చేయగా.. నామమాత్రంగా కేసు నమోదు చేశారని ఆయన తెలిపారు. రజిని, ఆమె మరిది గోపిపై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి