రిపబ్లిక్ హిందుస్థాన్, బజార్ హత్నూర్ : ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం లోని చింతల సాంగ్వీ గ్రామంలో సిడాం వంశియులు సోమవారం రోజు నోవోంగ్ పుజలు నిర్వహించారు. నోవోంగ్ అనగా కొత్తగా వేసిన పంటలు అయిన కూరగాయలు , దాన్యాలు , పండ్లలను, పంటలను పేర్స పేన్,సతిక్ పేన్,వన దేవతల ముందు ఉంచి పూజిస్తారు.
సామల బియ్యం, నెయ్యి తో నైవెద్యం వండి దేవతలకు సమర్పిస్తారు. ఆ నైవెద్యంను సిడాం వంశీయులు మాత్రమే తింటారు.మిగితా అన్నం,పప్పు, పిండి వంటలను వండి ఉరివాళ్ళకు అన్న ప్రసాదాలు వితరణ చేస్తారు .నాటి నుంచి పంట పోలాలలో పండిన పంటను, కూరగాయలు తినడం ప్రారంభిస్తార. అంతకు ముందు తినకుండా ఉంటారు.

ఈ నొవోంగ్ పూజలను ప్రతి గిరిజన గ్రామంలో అనాది కాలం నుంచి ఆచారంగా జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో సిడాం సుబాష్, భీంరావ్,హన్మంతు, రమేష్, దేవురావ్,తుకారాం, సిడాం వంశియ మహిళలందరు పాల్గోన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments