Tuesday, October 14, 2025

ఆదిలాబాద్‌లో భారీ భూమి కుంభకోణం బట్టబయలు


మావల పోలీస్‌ సక్సెస్‌ఫుల్ ఆపరేషన్

Thank you for reading this post, don't forget to subscribe!

నిందితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు

ఆదిలాబాద్ : మెసేజ్ యువర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా బాధితుల ఫిర్యాదుతో ఈ కుంభకోణం బట్టబయలు అయింది.

ఆదిలాబాద్ పట్టణంలో కోట్ల విలువైన 7 ప్లాట్లను నకిలీ పత్రాలతో డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఆక్రమించిన ముఠాను మావల పోలీసులు బట్టబయలు చేశారు.

అరెస్టైన నిందితులు:
నానం వెంకటరమణ (60) – RWS D.E.E., టీచర్స్ కాలనీ, ఆదిలాబాద్
ఉష్కం @ ఉష్క మల్ల రఘుపతి (43) – మావల, ఆదిలాబాద్
బెజ్జవార్ సంజీవ్‌కుమార్ (49) – ప్రభుత్వ ఉద్యోగి, ఆయుష్ విభాగం, రిమ్స్ ఆదిలాబాద్

పరారీలో ఉన్నవారు:
దుప్పలపూడి అశోక్ – సబ్ రిజిస్ట్రార్

కుంభకోణం ఎలా జరిగిందంటే?

బాధితుడు మిల్లింద్ కొర్తల్‌వార్ ఫిర్యాదుతో కేసు వెలుగులోకి వచ్చింది.

నిందితులు ఒరిజినల్ సేల్ డీడ్స్ ఉన్నా పట్టించుకోకుండా నకిలీ పత్రాలు సృష్టించారు.

సబ్ రిజిస్ట్రార్ అశోక్‌కు ₹7 లక్షల లంచం ఇచ్చి అదే ప్లాట్లను మళ్లీ రిజిస్ట్రేషన్ చేశారు.

సుమారు ₹2 కోట్ల విలువైన భూమి ఆక్రమణ.


మావల సీఐ కర్ర స్వామి దర్యాప్తులో భాగంగా నిందితుల పై  సెక్షన్లు IPC 447, 427, 420, 467, 468, 471, 120-B కింద కేసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు

పరారీలో ఉన్న సబ్ రిజిస్ట్రార్‌ పై కూడా కేసు నమోదు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై ప్రవీణ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!