epaper
Monday, January 5, 2026

ఇచ్చోడ మండలంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జెండా ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

 


ఇచ్చోడ, జనవరి 1, 2026: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో భవన నిర్మాణ కార్మిక సంఘం – నవనిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గాజంగుల రాజు హాజరై జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా గాజంగుల రాజు మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న లేబర్ బెనిఫిట్స్‌ను కార్మికులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పథకాలు, హక్కులు, వాటి అమలు విధానాలపై అవగాహన కల్పించారు.


కార్యక్రమంలో ఇచ్చోడ AITUC మండల ప్రధాన కార్యదర్శి కళ్లపెళ్లి గంగయ్య పాల్గొని సంఘీభావం తెలిపారు. కార్మికుల ఐక్యతే వారి బలమని, సమస్యల పరిష్కారానికి సంఘటితంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఇచ్చోడ మండల అధ్యక్షులు బోదాసు రవి, ఉపాధ్యక్షులు అన్నిల లక్ష్మణ్, గొలుసుగా విజయ్ కుమార్, కోశాధికారి మసీదు రాజేశ్వర్, సహకార కార్యదర్శి బొజ్జ రాజకుమార్, మాజీ అధ్యక్షులు గొలుసులో లక్ష్మణ్, రేణికుంట సురేష్, జిల్లా మాజీ అధ్యక్షులు కే. సంజు, అలాగే సిహెచ్ సుభాష్, రాములు, ఎస్. నరసింహులు, మెడపట్ల గంగ ఆశన్న, వన్నెల పెద్ద లక్ష్మన్న, బోలా భగత్ అర్జున్, రాజు, కొత్తూరు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే పెయింటర్ సంఘం అధ్యక్షులు, భవన నిర్మాణ మేస్త్రీలు, లేబర్ కార్మికులు, పెయింటర్ సంఘం కార్మికులు సహా అనేక మంది కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరణను విజయవంతం చేశారు.
ఇచ్చోడ భవన నిర్మాణ కార్మిక సంఘం ఇచ్చోడ మండల సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం కార్మికుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!