Friday, April 18, 2025

నేడు తెలంగాణ విమోచన దినోత్సవం….

విమోచన దినోత్సవం సందర్భంగా నిజాం మరియు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన గోండు పోరాట యోధుడు రాంజీ గొండ్ గూర్చి ప్రత్యేక కథనం…..

వెయ్యి ఉరుల మర్రి చెట్టు….

నిజాం సైన్యాన్ని చిత్తుగా ఓడించిన మహా యోధుని పై ” రిపబ్లిక్ హిందూస్థాన్ ” ప్రత్యేక కథనం

పోరాట యోధుడు రాజు రాంజీ గొండ్

రాంజీ గొండ్ అసిఫాబాద్ లో జన్మించారు. రాంజీ గొండ్ అప్పటి కాలంలో ఆదిలాబాద్ , నిర్మల్ , చెన్నూరు , ఉట్నూర్ ప్రాంతాల్లో తన పాలనను కొనసాగుతున్న సమయంలో బ్రిటిష్ రాజులు రాంజీ గొండ్ రాజ్యం పై అతిక్రమణ చేయడానికి దాడి చేశారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతానికి చెందిన బ్రిటిష్ సామంత రాజు అయిన హైదరాబాద్ అసఫ్ జా నిజాం గోండ్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు.

రాంజీ గోండ్ తన గోండు రాజ్యాన్ని కాపాడుకోవడానికి నిజాం మరియు బ్రిటిష్ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం చేశారూ.

నిజాం సైనికులకు వ్యతిరేకంగా రామ్‌జీ ఆయుధాలు తీసుకున్నాడు.

రోహిల్లా మరియు గోండ్ సైనికులతో పటిష్టం గా ఉన్న రాంజీ సైన్యం నిజాం సైన్యాన్ని చిత్తుగా ఓడించారు.
తరువాత, కొంతమంది బ్రిటిష్ సైనికులు గోండ్ రాజ్యంలోకి అక్రమంగా ప్రవేశించి, ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు. అస్తుల ద్వంసం పై ఆగ్రహించిన రామ్‌జీ గోండ్ ఈ సైనికులను చంపాడు.

ఆవేశంతో ఊగిపోయిన బ్రిటీష్ ప్రభుత్వం రామ్జీ గోండును పట్టుకోవడానికి కల్నల్ రాబర్ట్‌ను నియమించింది. 1860 ఏప్రిల్ 9 న, కల్నల్ రాబర్ట్‌కి రామ్‌జి గోండ్ ఆదిలాబాద్ నిర్మల్ గ్రామంలో ఉన్నట్లు సమాచారం వచ్చింది. అతను తన 1000 మంది సైనికులతో పాటు పట్టుబడిన రామ్‌జీపై దాడి చేసి ఓడించాడు.
9 ఏప్రిల్ 1857 న, రామ్‌జి గోండ్ మరియు అతని సహచరులను నిర్మల్ గ్రామంలోని ఒక మర్రి చెట్టుపై ఉరి వేసి చంపేశారు. ఈ విధంగా మరో జలియన్ వాలా బాగ్ ఘటన క్రూరమైన ఘటన నిర్మల్ లో జరిగింది.

ఈ చెట్టును వెయ్యి పుర్రెల (పుర్రె) చెట్టు లేదా వెయ్యి ఉరుల మర్రి అని పిలుస్తారు. రాంజీ గోండ్ యొక్క ఈ తిరుగుబాటు భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన మొదటి తిరుగుబాటు అని పిలవబడుతుంది.

రాంజీ గొండ్ పోరాటం ప్రేరణ మంగల్ పాండే ను పోరాటం స్వతంత్ర పోరాటం వైపు ఆకర్షితుణ్ణి చేసింది. ఈ విధంగా మంగల్ పాండే 1857 మార్చి 29 న బ్రిటిష్ అధికారులను చంపారు.

రాంజీ గొండ్ స్మారక స్థూపం

ఇది 1857 మే 10 న సిపాయ్ తిరుగుబాటుకు దారితీసింది. జలియన్ వాలాబాగ్ మారణకాండ కంటే క్రూరమైన మరియు మునుపటి సంఘటన. దురదృష్టవశాత్తు, నిజాం మరియు బ్రిటిష్ వారు ఈ సంఘటనను అణచివేయడం వలన గోండులకు రాజుకు జరిగిన అన్యాయం బయటకు రాలేదు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి