Wednesday, February 12, 2025

రైతులకు అందుబాటులో శనగ విత్తనాలు


రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : అదిలాబాద్ జిల్లా రైతులకు నంద్యాల శెనగ 1 ( NBeg-3) రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త శ్రీధర్ చౌహన్ తెలిపారు. శనగ విత్తనాలు వందరోజుల కాలపరిమితితో ఎకరానికి 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడినిస్తాయని తెలిపారు. అదేవిధంగా ఈ విత్తన రకం కొంతవరకు వేడిని , బెట్ట ను తట్టుకుంటాయని తెలిపారు. విత్తనాలు కూడా మధ్యస్థ లావుగా ఉంటాయని తెలిపారు. ఎకరానికి 30 కిలోలకు విత్తుకోవాలని రైతులను సూచించారు. కిలో విత్తనాలు ధర వంద రూపాయలు ఉన్నట్లు తెలిపారు.


ఈ సందర్భంగా విత్తన శుద్ధి చేసే విధానాన్ని వివరించారు. శనగ పంట వేసే సమయంలో రైతులు ఎండు తెగులు సమస్యను నివారించడానికి తప్పనిసరిగా విత్తనశుద్ది చేసుకోవాలని తెలిపారు. ప్రతి కిలో విత్తనాలకు 3 గ్రాముల థైరమ్/ కాపీటాన్ లేదా 2.5 గ్రాముల కార్బఇండిజమ్ లేదా 1.5 గ్రాముల విటావాక్స్ లను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలని అన్నారు.

విత్తనాలు కావాల్సిన రైతులు సీనియర్ శాస్త్రవేత్తలు డా శ్రీధర్ చౌహన్ ఫోన్ నెంబర్ 7337399461 , డా వి తిరుమల రావు – ఫోన్ నెంబర్ 90100 56667 , జి అనిల్ కుమార్ ఫోన్ నెంబర్ 9849402550 పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తల ఫోన్ నెంబర్లు ను సంప్రదించాలని అన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

Translate »
మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి