అమాయక ప్రజలు, రైతులే టార్గెట్ గా విత్తనాలు అమ్ముతున్న వ్యక్తుల పై పోలీసు నిఘా పెరిగింది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. నకిలీ విత్తనాలపై ఎలాంటి సమాచారం ఉన్న సిసిఎస్ ఇన్స్పెక్టర్ 8712659965 కు సమాచారం అందించాలి ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్ సూచించారు.
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఇచ్చోడ మండలంలో నకిలీ విత్తనాలు అమ్ముతున్న నలుగురిపై కేసు చేసి నమోదు, ముగ్గురినీ అరెస్ట్ చేసినట్లు ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్ తెలిపారు. నిందితుల వద్ద నుండి 27 నకిలీ విత్తన ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పట్టుబడిన నిందితుల వివరాలు
జాధవ్ గజానంద్ S/o కిషన్, వయస్సు: 35 సంవత్సరాలు, కులం: బీసీ-బీ (ఆరే మరాఠా), వృత్తి: వ్యవసాయం, చిరునామా: ఇస్లామ్నగర్, ఇచ్చోడా మండలం.
కంది శివ కుమార్ S/o భోజన్న, వయస్సు: 27 సంవత్సరాలు, కులం: మున్నూరుకాపు, వృత్తి: వ్యవసాయం, చిరునామా: కోకస్మన్నూర్ గ్రామం, ఇచ్చోడా మండలం.
కొతపల్లి రవీందర్ S/o నర్సయ్య, వయస్సు: 32 సంవత్సరాలు, కులం: మున్నూరుకాపు, వృత్తి: వ్యవసాయం, చిరునామా: కోకస్మన్నూర్ గ్రామం, ఇచ్చోడా మండలం.
ఆదవ్ రవికాంత్ S/o గంగాధర్, వయస్సు: 30 సంవత్సరాలు, కులం: బీసీ-బీ, వృత్తి: వ్యాపారం, చిరునామా: ముక్రా-బీ గ్రామం, ఇచ్చోడా మండలం (పరారీ).
నకిలీ విత్తనాలను జిల్లాలో పూర్తిగా అరికట్టేందుకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం ఏర్పడి ప్రత్యేక తనిఖీలను నిర్వహిస్తుందని అందులో భాగంగానే అంటే 24.05.2025 సాయంత్రం 7.00 గంటలకు, భగత్ రమేశ్ కుమార్ S/o భగత్ నామదేవ్, వయస్సు: 41 సంవత్సరాలు, వృత్తి: మండల వ్యవసాయ అధికారి, చిరునామా: ఆర్ & బి గెస్ట్ హౌస్, విద్యానగర్, ఆదిలాబాద్ నివాసమైన వారు ఇచ్చట పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా 24.05. 2025 మధ్యాహ్నం 5.00 గంటల సమయంలో విశ్వసనీయమైన సమాచారం ఆధారంగా పోలీసు శాఖ బృందం జాధవ్ గజానంద్ ఇంటిపై దాడి నిర్వహించగా, అక్కడ తొమ్మిది తిలక్ 5G నకిలీ విత్తన ప్యాకెట్లు కనుగొన్నారు. నకిలీ విత్తనాల విక్రయంపై అడగగా, జాధవ్ గజానంద్ నకిలీ విత్తనాలు కోకస్మన్నూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు విక్రయించినట్లు వెల్లడించారు.
అనంతరం టాస్క్ ఫోర్స్ బృందం జాధవ్ గజానంద్తో కలిసి కోకస్మన్నూర్ గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు. విచారణలో ఆ ఇద్దరు వ్యక్తుల వివరాలు ఇలా ఉన్నాయి:
1. కె. శివ కుమార్ S/o భోజన్న, వయస్సు: 27 సంవత్సరాలు, కులం: మున్నూరుకాపు – ఇతనిది 06 విక్రాంత్-44 నకిలీ విత్తన ప్యాకెట్లు (మొత్తం 27 నకిలీ విత్తనాలు, అంచనా విలువ రూ. 32,400/-).
2. కొతపల్లి రవీందర్ S/o నర్శింలు, వయస్సు: 32 సంవత్సరాలు, కులం: మున్నూరుకాపు – ఇతనిది 12 విక్రాంత్-44 నకిలీ విత్తన ప్యాకెట్లు.
తరువాత జాధవ్ గజానంద్ను మరింతగా ప్రశ్నించగా, అతను ఈ నకిలీ విత్తనాలను ఆదవ్ రవికాంత్ S/o గంగాధర్, వయస్సు: 30 సంవత్సరాలు, కులం: ఆరే మరాఠా, నివాసం: ముక్రా-బి (తప్పించుకున్నాడు) వద్ద నుండి కొనుగోలు చేసి రైతులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. అదనంగా, ఆదవ్ రవికాంత్ మహారాష్ట్ర నుండి నకిలీ విత్తనాలను తీసుకువచ్చి, జాధవ్ గజానంద్ ద్వారా అమాయక రైతులకు విక్రయిస్తున్నాడని పేర్కొన్నారు. ఈ నలుగురిపై ఇచ్చోడ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు అయిందని తెలిపారు. అమాయక రైతులు మరియు ఆదివాసి రైతులను కాపాడడానికి జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి నకిలీ విత్తన మాఫియాను అరికట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఎలాంటి సమాచారం ఉన్న టాస్క్ఫోర్స్ సిఐ 8712659965 నెంబర్ కు సంప్రదించాలని తెలిపారు సంప్రదించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. రైతులకు సూచనలు ఇస్తూ డీలర్ల వద్ద, గుర్తింపు పొందిన దుకాణాల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసే ముందు విత్తన ప్యాకెట్లపై సరైన లేబుల్, ఎక్స్పైరీ డేట్, తయారీ డేట్ ఉంటాయని అదేవిధంగా వ్యాపారి వద్ద నుండి బిల్లును తీసుకోవాల్సిందిగా సూచించారు. రైతులెవ్వరు కూడా లూస్ విత్తనాలను కొనకుండా ఉండడం శ్రేయస్కరమని సూచించారు. ఎలాంటి అనుమానం ఉన్న జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించవచ్చని తెలిపారు.
ఆదిలాబాద్ లో….
*బేల మండలంలో ఇద్దరిపై కేసు నమోదు, ఒకరి అరెస్ట్.*
*10 కిలోల లూజ్ నకిలీ విత్తనాలు, 26 నకిలీ విత్తన ప్యాకెట్ల స్వాధీనం.*
*అమాయక ప్రజలు రైతులే టార్గెట్ గా విత్తనాలు అమ్ముతున్న వ్యక్తులు.*
*జిల్లా ఎస్పీ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్.*
*నకిలీ విత్తనాలపై ఎలాంటి సమాచారం ఉన్న సిసిఎస్ ఇన్స్పెక్టర్ 📞 8712659965 కు సమాచారం అందించాలి

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్: నకిలీ విత్తనాలను జిల్లాలో పూర్తిగా అరికట్టేందుకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం ఏర్పడి ప్రత్యేక తనిఖీలను నిర్వహిస్తుందని అందులో భాగంగానే ఈరోజు జైనథ్ పోలీసులు బేల మండల కేంద్రంలోని సిరిసన్న గ్రామంలో అమాయక ఆదివాసి రైతులను ప్రజలను మోసం చేస్తూ నకిలీ విత్తనాలను అమ్ముతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా సిర్సన్న గ్రామం నందు నిందితుడు *ఎండి కుర్షిద్* s/o ఎండి కాలిక్ సిర్సన్న గ్రామం బేల మండలం, వద్ద ఐదు కిలోల లూజ్ నకిలీ విత్తనాలు మరియు 23 నకిలీ విత్తన ప్యాకెట్లు లభించినట్లు ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. ఇతనిని విచారించగా ఇతను తన బావ మహారాష్ట్ర నందు నివసిస్తున్న నిందితుడు *మహమూద్* వద్ద 10 కిలోల లూజు నకిలీ విత్తనాలు మరియు 26 ప్యాకెట్ల నకిలీ విత్తనాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు
. నిందితుని విచారించగా ఇతడు అమాయక రైతులైన బేల మండలం బాది గ్రామ లో జలపతి అని రైతుకి ఐదు కిలోల నకిలీ విత్తనాలను 13 వేలకు విక్రయించినట్లు అదే విధంగా జుగ్నకే శంభు అనే రైతుకు మూడు ప్యాకెట్ల నక్షత్ర 5జి అనే నకిలీ విత్తన పాకెట్లను 1200 ల రూపాయలకు విక్రయించినట్లు తెలిపారు. నిందితులిద్దరిపై బేల పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఇతని వద్ద లభించిన నకిలీ విత్తన పాకెట్లు నక్షత్ర 5g అనే పేరుతో ఎటువంటి లేబుల్స్ లేకుండా, తయారీ మరియు ఎక్స్పైరీ డేట్ లేకుండా, వివరములు లేకుండా ఉండటం జరిగిందని ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు.
అమాయక రైతులు మరియు ఆదివాసి రైతులను కాపాడడానికి జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి నకిలీ విత్తన మాఫియాను అరికట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఎలాంటి సమాచారం ఉన్న టాస్క్ఫోర్స్ సిఐ 8712659965 నెంబర్ కు సంప్రదించాలని తెలిపారు సంప్రదించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
రైతులకు సూచనలు ఇస్తూ డీలర్ల వద్ద, గుర్తింపు పొందిన దుకాణాల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని కొనుగోలు చేసే ముందు విత్తన ప్యాకెట్లపై సరైన లేబుల్, ఎక్స్పైరీ డేట్, తయారీ డేట్ ఉంటాయని అదేవిధంగా వ్యాపారి వద్ద నుండి బిల్లును తీసుకోవాల్సిందిగా సూచించారు. రైతులెవ్వరు కూడా లూస్ విత్తనాలను కొనకుండా ఉండాలని తెలిపారు. ఎలాంటి అనుమానం ఉన్న జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జైనథ్ సిఐ డి సాయినాథ్, బేల జైనథ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments