Monday, February 17, 2025

PDS RICE : 30 క్వింటాళ్ల రాయితీ బియ్యం స్వాధీనం



— ఇద్దరి అరెస్టు,రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు..

— వివరాలు వెల్లడించిన రెండవ పట్టణ ఎస్సై వి విష్ణు వర్ధన్..

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్-( క్రైం) :
సోమవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో  ఆదిలాబాద్ నుండి మహారాష్ట్ర కు రాయితీ బియ్యన్ని తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు రెండవ పట్టణ ఎస్ఐ విష్ణు వర్ధన్ ఆధ్వర్యంలోని బృందం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకూరి లక్ష్మీ నగర్ బ్రిడ్జ్ వద్ద తనిఖీ చేయగా వాహనంలో ముప్పై క్వింటాళ్ల రాయితీ బియ్యం లభించిందని తెలిపారు. వాహనం లో గల నిందితులు *ముంతాజ్ సయ్యద్ (29)* , కిన్వాట్ డిస్ట్రిక్ట్  చెందినవారు మరియు *మహమ్మద్ జావిద్(31)* యవత్మాల్ డిస్ట్రిక్ట్ టు సంబంధించిన ఇద్దరిని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. పట్టుకున్న రాయితీ బియ్యం ని పౌరసరఫరాల శాఖ అధికారులకు కు అప్పజెప్పిన టు తెలిపారు. ఈ ఆపరేషన్లో ఎం ఎ కరీం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

Translate »
మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి