Sunday, May 18, 2025

ఎస్సైను సన్మానించిన సామాజిక కార్యకర్తలు



రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చోడ : మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన పురుషోత్తం ను సామాజిక కార్యకర్తలు , నాయకులు సయ్యద్ నౌషాద్ , షేక్ సాజిద్ లు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో ఎస్సైను సన్మానించారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్సై తిరుపతి స్పెషల్ బ్రాంచ్ కు బదిలీపై వెళ్లగా , ఆయన స్థానంలో జైనథ్ ఎస్సైగా విధులు నిర్వహించిన పురుషోత్తం ఇచ్చోడ కు బదిలీపై వచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణలో నాయకులు , మండల ప్రజలు సహకరించాలని ఎస్సై కోరారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి