ప్రతి ఒక్కరూ సామజికబాధ్యతతోవ్యాక్సిన్ వేసుకోవాలనికోరిన :నిమ్మలప్రీతంరెడ్డి , ఎంపిపి, ఇచ్చోడ
Thank you for reading this post, don't forget to subscribe!15 నుండి 18 సంవత్సరాలు వయస్సు గల ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ ను తీసుకోవాలని ఇచ్చోడ ఎంపిపి నిమ్మల ప్రితం రెడ్డి కోరారు. కోవిడ్ బారి నుండి తమను తాము , దేశాన్ని రక్షించుకోవడానికి టీకా వేసుకోవడం తప్పనిసరి అన్నారు. సోమవారం 15 నుండి 18 సంవత్సరాల వారి కోసం వ్యాక్షినేషన్ వేసే కార్యక్రమాన్ని ఇచ్చోడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా 300 మంది విద్యార్థులు, యువకులు వ్యాక్సిన్ ను వేయించుకున్నారు. బాధ్యతతో విద్యార్థులను వెంట తీసుకొని వచ్చి వ్యాక్సిన్ వేయించిన TTWRSJC ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్ ను మరియు డాక్టర్ సాగర్ ను ఎంపిపి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లోక శిరీష్ రెడ్డి, ఎంపిటిసి నిమ్మల శివకుమార్ రెడ్డి , కదం బాబా రావ్ పటేల్ ఆసుపత్రి సిబ్బంది తదతరులు పాల్గోన్నారు.
Recent Comments