Thank you for reading this post, don't forget to subscribe!
మహిళ దారుణహత్యకు గురైన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మాదారం గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. మండలంలోని గోవిందరాజు పల్లికి చెందిన సునీత (35) మాదారం గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు.
గురువారం మృత దేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం గుర్తించి హత్యకు గల కారణాలు విచారణ జరుపుకున్నామని స్థానిక ఎస్ఐ సుభాష్ తెలిపారు.


Recent Comments