ఇచ్చోడ / నర్సాపూర్, ఏప్రిల్ 22, 2025: పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా నర్సాపూర్లో 11 మంది గర్భవతులకు సీమంతం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భవతులు, బాలింతలు, కిశోర బాలికలకు ICDS సూపర్వైజర్ జె. విమల 1000 రోజుల పోషణ ప్రాముఖ్యత, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఆకుకూరలు, కూరగాయలు, చిరుధాన్యాల వినియోగం యొక్క ప్రయోజనాలను కూడా ఆమె విశదీకరించారు.
Thank you for reading this post, don't forget to subscribe!



కార్యక్రమంలో నర్సాపూర్ PHC డాక్టర్ హిమబిందు, హెల్త్ సూపర్వైజర్ రాజేశ్వరి, ANM, ASHA వర్కర్లు, నర్సాపూర్ సెక్టార్ అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గర్భవతులు, బాలింతలకు పోషకాహార అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించింది.
Recent Comments