Monday, October 13, 2025

‘జనాన్ని జగన్‌ నమ్మడు..’ అచ్చుతప్పుల ఫ్లెక్సీతో అభాసుపాలైన వైకాపా నాయకులు

సర్పవరంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో ‘జనాన్ని జగన్‌ నమ్మడు.. జగనన్నని మీరు నమ్మండి’ అని ముద్రించారిలా..

Thank you for reading this post, don't forget to subscribe!

కాకినాడ గ్రామీణ మండలం సర్పవరంలో వైకాపా నాయకులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ సీఎం జగన్‌ను అభాసుపాలు చేసింది.

‘సిద్ధం’ పేరుతో ఉన్న ఈ ఫ్లెక్సీలో ‘కాకినాడ రూరల్‌ ప్రజలారా.. జనాన్ని జగన్‌ నమ్మడు.. జగనన్నని మీరు నమ్మండి.. మీ ఓటు ద్వారా జగనన్నను దీవిస్తారని ఆశిస్తున్నాం’ అంటూ పేర్కొన్నారు. ఈ దోషాన్ని గమనించి కొందరు ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అప్రమత్తమైన స్థానిక నాయకులు ‘నమ్మడు’ అనే పదాన్ని ‘నమ్మాడు’ అని దిద్దారు. తర్వాత ఆ పదంపై కాగితం అంటించారు. దానినీ కొందరు తొలగించడంతో గత్యంతరం లేక ఏకంగా ఫ్లెక్సీనే తీసేశారు. సీఎం జగన్‌, వైకాపా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌..ఎమ్మెల్యేలు ద్వారంపూడి, కన్నబాబు చిత్రాలతో ఉన్న ఈ ఫ్లెక్సీని స్థానిక వైకాపా నాయకుడు పుల్ల కోటేశ్వరరావు ఏర్పాటుచేశారు.

తప్పు గమనించిన అనంతరం ఇలా కాగితం అంటించి.. ఆ తర్వాత తొలగించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!