- సామాజిక సేవకులు సత్యరాజ్ ఉపారపు
రత్న సాన్వి వెల్పేర్ సొసైటీ ద్వారా వాలీబాల్ కిట్ అందజేత
Thank you for reading this post, don't forget to subscribe!యువత చదువుతో పాటు క్రీడాల్లో రాణించాలని రత్న సాన్వి వెల్పేర్ సొసైటీ వ్యవస్థాపకులు ఉపారపు సత్యరాజ్ అన్నారు.గుడిహత్నూర్ మండలం లోని లింగాపూర్ గ్రామానికి చెందిన యువకులకు ఆదివారం వాలీబాల్ కిట్ అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ యువతకు, యువ క్రీడా కారులకు ప్రోత్సాహం ఇవ్వడానికి తాను ఎల్లవేళలా ముందు ఉంటానని అన్నారు. యువకులు క్రీడల్లో ముందు ఉండాలని,అలాగే చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అయన అన్నారు.కార్యక్రమంలో యువకులు, క్రీడాకారులు సుధామ్, మిలింద్, సచిన్, పవన్, రాహుల్ తదితరులు ఉన్నారు
Recent Comments