రిపబ్లిక్ హిందుస్థాన్, హైదరాబాద్ /నిర్మల్ : నిర్మల్ జిల్లా పట్టణంలోని దివ్య నగర్ కాలనీకి చెందిన నృత్య మాల నాట్య అకాడమీ శిక్షకురాలు ఏలేటి అంజలి రెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ పొందుతూ హైదరాబాదులో ఆదివారం తెలంగాణ సరస్వతి పరిషత్ రవి శ్రీ యూనిక్ వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది మహోత్సవ కూచిపూడి నృత్య ప్రదర్శనలో ప్రతిభ కనపర్చిన వేదశ్రీ , వేదాన్షి, హరిణి, అద్విత, కృష్ణప్రియ,రిత్విక , భార్గవి, మేర రెడ్డి, శాన్విక లకు సరస్వతి పరిషత్ రవి జబర్దస్త్ అప్పారావు, తుమ్మలపల్లి రమ సత్యనారాయణ, తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ రవీందర్ చేతుల మీదుగా అవార్డు పొందారు. ఈ సందర్భంగా శిక్షకురాలు ఏలేటి అంజలి రెడ్డి మాట్లాడుతూ సంతోషంగా ఉన్నదని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
కూచిపూడి నృత్య ప్రదర్శనలో చిన్నారులకు అవార్డ్
Thank you for reading this post, don't forget to subscribe!


Recent Comments