Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్, రామకృష్ణాపూర్ : సింగరేణి ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రాజా రమేష్ బాబు ని బదిలీ చేయడాన్ని రాజకీయ కుట్రగా భావిస్తున్నట్టు బిజెపి, కాంగ్రెస్, కార్మిక యూనియన్ నాయకులు తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ఫ్లాకార్డులతో ఏరియా ఆసుపత్రి ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.ఎలాంటి కారణం లేకుండా డాక్టర్ రాజా రమేష్ ని బదిలీ చేయడం వెనుక అధికార పార్టీ ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. బదిలీని నిలిపివేయకుంటే రానున్న రోజుల్లో మరింత పోరాటం చేస్తామని హెచ్చరించారు.
Recent Comments