రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇచ్చోడ : బుధవారం ఇచ్చొడా మండలంలోని జల్దా అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ సూపర్ వైజర్ దేవి ఉమా రాణి తనికులు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న అతి తీవ్ర పోషణ గల(SAM) పిల్లలను గుర్తించి వారి బరువులు,ఎత్తు,భుజంకొలతలు తీసుకుని అవసరమైన పిల్లలకు డబుల్ రేషన్ ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రం నుండి అందే విధంగా చర్యలు చేపట్టారు. అంగన్వాడీ టీచర్లు ఈ తెలియచేస్తూ ప్రతి అంగన్వాడీ కేంద్రము లో పౌష్టికాహార లోపాలున్నా పిల్లల పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అన్నారు. అతి తీవ్ర పోషణ తో ఉన్న పిల్లలు ను అదిలాబాద్ రిమ్స్ లో ఉన్న NRC కీ పంపాలని సూచించారు. Sam పిల్లల తల్లి తండ్రులకు ప్రతి బుధవారం సమావేశం ఏర్పాటు చేసి వాళ్లకు పిల్లల బరువు,ఎత్తు,భుజంకొలతలు,ఆరోగ్యం గురించి వివరించాలని అంగన్వాడీ టీచర్లను సూచించారు.
పిల్లల పోషణ పై శ్రద్ద తీసుకోవాలి
Thank you for reading this post, don't forget to subscribe!


Recent Comments