నేటి నుంచి మూడు రోజులు అతి భారీ వర్షాలు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దీనికితోడు మరో రుతు పవన ద్రోణి ఏర్పడిందని పేర్కొంది. దీంతో శని, ఆది, సోమ వారాల్లో కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా శుక్రవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments