Friday, November 7, 2025

టిటిఎఫ్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం మంత్రికి వినతి పత్రం

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

ఆదిలాబాద్ : పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు టిటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని టిటీఏఫ్ అదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ జాదవ్ వినతిపత్రం సమర్పించారు .
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 03 ని చట్టబద్ధత కల్పించాలని క్రింది డిమాండ్ పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
సిపిఎస్ విధానాన్ని రద్దు, చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి బదిలీలు పదోన్నతులు వెంటనే చేపట్టాపని అన్నారు. ఉపాధ్యాయులకు రావలసిన ఏరియర్స్ మరి జిపిఎఫ్ డిఎల్ లను వెంటనే విడుదల చేయాలనీ కోరారు.
భాషా పండితులకు , పీఈటి లను లను అప్గ్రేట్ చేయాలనీ , గిరిజన ప్రాంతంలో గల పాఠశాలలను మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గిరిజన గురుకులంలో పని చేస్తున్న అధ్యాపక ఉపాధ్యాయులకు 12 నెలల వేతనం ఇవ్వాలని,  గిరిజన శాఖలో పనిచేస్తున్న సిఆర్డిల వేతనం విడుదల చేయాలని అన్నారు. జీవో నెం.317 ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు వారి వారి జిల్లాలో పోస్టింగ్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు .
ఈ కార్యక్రమంలో టిటిఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!