Friday, November 7, 2025

Ayodhya: అయోధ్యలో విమానాశ్రయం, రైల్వేస్టేషన్ ప్రారంభించిన ప్రధాని మోడీ

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!



అయోధ్య, ఉత్తరప్రదేశ్ :
అయోధ్యలో పునర్మించిన రైల్వేస్టేషన్..అయోధ్య ధామ్ రైల్వేస్టేషన్‌ను శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిం చారు. జాతికి అంకితం చేశారు.

అలాగే..కొత్త అమృత్ భారత్ రైళ్లు, 6 వందేభారత్ రైళ్లను జెండా ఊపి మోడీ ప్రారంభించారు.అయోధ్యలో ఒక రోజు పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ బిజీగా గడుపుతున్నారు.

అనేక ఇతర రైల్వే ప్రాజెక్టుల ను కూడా ఆయన జాతికి అంకితం చేశారు. ఇవాళ ప్రధాని మోడీ, అయోధ్యలో కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా ప్రారంభించారు.

అలాగే రాష్ట్రంలో రూ.15,700 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారం భోత్సవాలు,శంకుస్థాపన చేసే బహిరంగ కార్యక్ర మంలో ప్రధాని పాల్గొన్నారు.

వీటిలో అయోధ్య, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధి కి సుమారు రూ.11,100 కోట్ల విలువైన ప్రాజెక్టులు, ఉత్తరప్రదేశ్ అంతటికీ సంబంధించి దాదాపు రూ.4600 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి.


రాముడి జన్మస్థలంతో ముడిపడి ఉన్న ఈ పవిత్ర స్థలం కోసం నిర్మించిన విమానాశ్రయం, రైల్వేస్టేష న్‌ని రామాయణ గాథలతో నిర్మించారు.

రాముడు, లక్ష్మణుడు, సీతా మాత, హనుమంతుడు. రామాయణానికి సంబంధించిన ఇతర పాత్రలు ఈ ప్రాజెక్టుల్లో కనిపిస్తాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!