Wednesday, October 15, 2025

డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త, షెడ్యూల్‌ విడుదల

టీచర్‌ పోస్టుల అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. డీఎస్సీకి షెడ్యూల్‌ విడుదల చేసింది. ఫిబ్రవరి 7న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ షెడ్యూల్‌ ప్రకటించారు.

Thank you for reading this post, don't forget to subscribe!

మార్చి 15 నుంచి 30 వరకు రెండు విడతలగా పరీక్షలు నిర్వహించనున్నారు.

దరఖాస్తు ప్రక్రియ ‍ప్రారంభం..
ఏప్రిల్‌ 7న ఫలితాలు వెల్లడిస్తారు. ఫిబ్రవరి 12 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. మార్చి 5 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.రాష్ట్రంలో 6,100 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 386 పోస్టులు భర్తీకి చర్యలు తీసుకున్నారు.

ఇందులో ఎస్జీటీ పోస్టులు 107, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 164, టీజీటీ పోస్టులు 115 ఉన్నట్లు తెలిసింది. టెట్‌ పరీక్షలు ఈనెల 27 నుంచి మార్చి 9 వరకు జరగనున్నాయి. హాల్‌ టికెట్లు ఈనెల 23 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!