*ఘన్పూర్ చెక్పోస్ట్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ*
*బోథ్, బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్లో ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ.*
*సిబ్బంది కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించేలా చూడాలి.*
అదిలాబాద్ : కేసుల నమోదులో చాప్యం చేయకుండా సక్రమంగా కేసుల నమోదు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ మరియు బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బోథ్ పోలీస్ స్టేషన్ నందు ఒక మొక్క నాటి పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో ఉన్న వాహనాలపై వాటి స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ పోలీస్ స్టేషన్లో నమోదు అవుతున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదారుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ, ప్రతి ఒక్క ఫిర్యాదును ఆన్లైన్లో, ఆఫ్లైన్లో నమోదు చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో వారీగా ఉన్న రౌడీ షీటర్ లను మరియు సస్పెక్ట్ షీట్లను ఓపెన్ చేసి వారిని నిరంతరం తనిఖీ చేస్తూ ఉండాలని తెలియజేశారు. ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు జాగ్రత్తలు చేపడుతూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రిసెప్షన్ సెంటర్ నందు వచ్చే వారి సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా సిబ్బందిని కేటాయించి బాధితులకు తగు న్యాయం చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో ఉండే సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు.



సిబ్బందికి కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించేలా చూసుకోవాలని తెలిపారు. కేసుల నమోదు ఎటువంటి జాప్యం లేకుండా ఉండాలని తెలిపారు. ఘన్పూర్ చెక్ పోస్ట్ ని పరిశీలించి వాహనాల రాకపోకలు గమనించారు, అదేవిధంగా మహారాష్ట్రతో సరిహద్దుతో ఉన్నందున దొంగలు వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తతో ఉండాలని తెలిపారు. నూతన పోలీసు సిబ్బందికి అన్ని రకాల విధులను కేటాయిస్తూ వారిని అని రంగాలలో నిష్ణాతులను చేసే విధంగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, బోథ్ సర్కిల్ సీఐ ఏ వెంకటేశ్వర్లు, బోథ్ మరియు బజార్హత్నూర్ ఎస్సై ఎల్ ప్రవీణ్, ఏ అప్పారావు, పిఎస్ఐ రాజశేఖర్ రెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments