రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
అక్రమ కొనుగోళ్లు, తుకాలలో మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్ లో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అక్రమ పత్తి కొనుగోళ్లు, రైతులను మోసం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ, తూనికలు కొలతల శాఖల అధికారులతో జిల్లా, మండల స్థాయిలలో కమిటీలను ఏర్పాటుచేయాలనీ సూచించారు. ఈ సమావేశంలో శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మహాతో, మార్కెటింగ్ శాఖల అధికారులు శ్రీనివాస్, మధుకర్, తదితరులు పాల్గొన్నారు.
అక్రమ కొనుగోళ్లు, తుకాలలో మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు
Thank you for reading this post, don't forget to subscribe!
RELATED ARTICLES


Recent Comments