Wednesday, October 15, 2025

రెవెన్యూ అధికారి ఇంట్లో ఏసీబి సోదాలు… భారీగా  గుర్తించిన నగదు 2.93 కోట్లు…  ఆస్తులు..?

నిజామాబాద్‌ : నిజామాబాద్ నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారి నరేందర్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీల్లో భారీగా నగదు, బంగారం గుర్తించినట్టు సమాచారం. శుక్రవారం ఉదయం 5గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీల్లో రూ.6.07 కోట్ల విలువ చేసే అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. అక్రమాస్తులు కలిగి ఉన్నాడనే సమాచారంతో నిజామాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు నరేందర్ ఇంట్లో సోదాలు జరిపారు. ఇంటితో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, కోటగల్లి, నిర్మల్‌లోని ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. వినాయక్‌నగర్‌లోని అశోక టవర్‌లో ఉన్న నరేందర్ ఇంట్లో ఏకంగా రూ.2.93 కోట్ల నగదు గుర్తించారు. అలాగే ఆయన భార్య బ్యాంకు ఖాతాలో రూ.1.10 కోట్ల నగదు,  51తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.1.98 కోట్లు విలువ చేసే 17 స్థిరాస్తులను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం నరేందర్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. ఈ దాడుల్లో నాలుగు బృందాలు పాల్గొన్నాయని పేర్కొన్నారు.

Thank you for reading this post, don't forget to subscribe!
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!