Tuesday, October 14, 2025

జొన్న లాప తిని 20 ఆవులు మృతి

ఆర్థిక సాయం కోరుతున్న రైతులు

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ :  బజార్ హత్నూర్ మండలం, బుర్కపల్లి గ్రామంలో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. రోజువారీగా మేతకు వెళ్లిన 20 ఆవులు జొన్న లేత మొలకలు (లాప) తినడం వల్ల మృతి చెందాయి. ఈ విషయం తెలుసుకున్న మండల రెవెన్యూ అధికారి గిరిదావర్ రాథోడ్ నూర్ సింగ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి, గ్రామ రైతులతో మాట్లాడారు. జొన్న లేత మొలకలు మేయడం వల్ల ఆవులు మరణించినట్లు రైతులు తెలిపారు.

మరణించిన ఆవుల యజమానుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

  1. బర్ధవాల్ నానాక్ సింగ్ – 3 ఆవులు
  2. టాక్ డా నానాక్ సింగ్ – 4 ఆవులు
  3. మాటవాన్ గులాబ్ సింగ్ – 1 ఆవు
  4. సబడే చందర్ సింగ్ – 1 ఆవు
  5. బర్ధవాల్ గురువే సింగ్ – 1 ఆవు
  6. జాతీవే న్యాల్ సింగ్ – 1 ఆవు
  7. జాతీవే సుభాష్ – 1 ఆవు
  8. నిస్తే హుషార్ సింగ్ – 2 ఆవులు
  9. బనియ రామ్ – 1 ఆవు
  10. భామన్ పర్షు రామ్ – 1 ఆవు
  11. బస్సి హర్ సింగ్ – 1 ఆవు
  12. మాటవాన్ కాపుర్ చందు – 2 ఆవులు
  13. మాటవాన్ గోపి చందు – 1 ఆవు

మొత్తం 13 మంది రైతులకు చెందిన 20 ఆవులు మరణించాయి. ఒక్కో ఆవు సుమారు 20,000 రూపాయల విలువైనదని, మొత్తం 4 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. తమ జీవనాధారమైన ఆవులను కోల్పోయిన రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.

రైతులు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు. అధికారులు సంఘటనపై విచారణ జరుపుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!