
రిపబ్లిక్ హిందుస్థాన్ :ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని తోషం గ్రామం నుంచి తెలంగ్ రావుగూడ వెళ్లే రోడ్డు బ్రిడ్జి కుంగి, సిమెంట్ దిబ్బలు పడుతూ అతి ప్రమాదకరంగా మారింది, ప్రతి రోజు తెలంగ్ రావుగూడ గ్రామస్తులు నిత్యావసరాల సరుకుల కోసం రాకపోకలు సాగిస్తుంటారు. ఎప్పుడైన వాహనాలు వెళ్లేటప్పుడు ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత ఆని ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రాయిసిడం జంగు పటేల్ ప్రశ్నిస్తున్నారు, అధికారులు స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.



Recent Comments