Wednesday, October 15, 2025

భారీ పేకట స్థావరం గుట్టురట్టు – ఏడుగురి అరెస్ట్

పేకాట స్థావరం నిర్వాహకుని తో పాటు 6 గురి అరెస్ట్…

⬛ రూ.1,12,820/- నగదు, ఒక కార్, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం, మావల పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు …

Thank you for reading this post, don't forget to subscribe!

వివరాలు వెల్లడించిన  సి సి ఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : బుధవారం రోజు జిల్లా కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న పేకాట స్థావరం పై పోలీసులు మెరుపు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్న సంఘటన  చోటుచేసుకుంది.
సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి తెలిపిన వివరాల ప్రకారం…
మావల పోలీస్ స్టేషన్ పరిధి నందు ఆదిలాబాద్ పట్టణంలోని సాయి నగర్ రేణుక మాత మందిరం దగ్గర ప్రాంతంలో దామోదర్ రెడ్డి నివాసం పైన అద్దెకి సాజిద్ హుస్సేన్ అనే వ్యక్తి పేకాట స్థావరం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో   మావల ఎస్సై ఇసాక్ ఆధ్వర్యంలోని బృందం దాడి చేయడంతో సంఘటన స్థలంలో పేకాట స్థావరం నిర్వాహకుడితో పాటు పేకాట ఆడుతున్న ఏడుగురు  పట్టుబడినట్లు తెలిపారు.  పట్టుబడిన నిందితులలో  వివరాలు…
1) సాజిద్ హుస్సేన్ s/o జాహీర్ హుస్సేన్, విద్యానగర్.
2) ఏ విజయ్ కుమార్ s/o దర్శనాత్, టీచర్స్ కాలనీ.
3) నియాజుద్దిన్ s/o షైతుద్దీన్, పిచ్చోడా.
4) కే దామోదర్ రెడ్డి s/o ముత్యం రెడ్డి, టీచర్స్ కాలనీ.
5) ముండ నాగనాథ్ s/o బాబురావు, ఇంద్రవెల్లి.
6) ఏ హితేంద్రనాథ్ యాదవ్, న్యాయవాది, బుక్తాపూర్.
7) సయ్యద్ జఫర్ అహ్మద్  అదిలాబాద్
లను సంఘటన స్థలంలో పట్టుకుని వారి వద్ద నుండి రూ 1,12,820/- నగదు, ఒక కారు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరందరిపై మావల పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ నందు మావల ఎస్ఐ సయ్యద్ ఇసాక్, సిసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!