ఆన్లైన్ మట్కా నిర్వాహకుల అరెస్ట్*

📰 Generate e-Paper Clip

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్  : ఆన్లైన్ లో మట్కా నిర్వహిస్తున్న వ్యక్తులను ఆదిలాబాద్ సిసిఎస్ సిఐ  చంద్రమౌళి అరెస్ట్ చేశారు. సిసిఎస్ సిఐ తెలిపినా వివరాల ప్రకారం ఆదిలాబాద్ లోని శ్రీ రామ్ కాలనీ ఏరియా లో శివాలయం దగ్గర అహ్మద్ అనే వ్యక్తి దగ్గర ఆన్లైన్ మట్కా నిర్వహిస్తున్నట్టు సమాచారం వచ్చిందని, ఈ మేరకు అతని యొక్క  సెల్ఫోన్ చెక్ చేయగా మట్కా నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. అహ్మద్ అనే వ్యక్తితో పాటు ప్రశాంత్ అనే వ్యక్తి అతనితో అదే సమయంలో ఉండడం తో అతని సెల్ ఫోను చెక్ చేయగా అతని ఫోన్లో కూడా మట్కా నిర్వహిస్తున్నట్టు ఉంది. నిందితులు  ఇద్దరి వద్ద రూ.74150 రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, విచారణ నిమిత్తం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పజెప్పినట్లు తెలిపారు.  ఈ యొక్క దాడి లో సిసిఎస్ సిఐ గారు చంద్రమౌళి, ఎస్సై డి రమేష్ మరియు వన్ టౌన్ ఎస్ఐ  అంజమ్మ అశోక్,  ఎస్ఐ  పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments