ePaper
Wednesday, March 4, 2026
📄 ePaper

ఈ నెల 15 న రెండు రాష్ట్రాల గవర్నర్లతో ఆదివాసీ నాయకుల సమావేశం

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!


రిపబ్లిక్ హిందుస్థాన్, ఇంద్రవెల్లి : ఈనెల 15న ఆదిలాబాద్ జిల్లా లోని కేస్లాపూర్ నాగోబా దర్బార్ లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై మరియు అదేవిధంగా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావులు వస్తున్నట్లు తుడుం దెబ్బ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 11/11/2021 నాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంఘ నాయకులతో ముఖ్య సమావేశం జరుగుతుందని తుడుండెబ్బ రాష్ట్ర కార్యదర్శి కడప నగేష్ తెలిపారు. ఆదివాసి సమాజ పెద్దలు, గ్రామ పటెల్ లు, సంఘాల నాయకులు, రాయిసెంటర్ సార్ మెడిలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు,ఆదివాసులు పెద్ద మొత్తంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కోడప నగేష్, అదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గోడం గణేష్,జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావ్ మహిళ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోర్ పుష్పరాణీ,జిల్లా కార్యదర్శి వెట్టి మానోజ్ ,జిల్లా సలహా దారుడు కనక తుల్సిరాం ,తోడషం శంకర్ బోథ్ డివిజన్ అద్యక్షులు ఇంద్రవేల్లి తుడుందెబ్బ మండల అద్యక్షులు జుగ్నాక్ బారత్ ,ప్రధాన కార్యదర్శి పుర్క హన్మంత్ రావ్ ,ఉపాద్యాక్షులు ముకడే ఉత్తం,గేడం బారత్ ,మాడవి లచ్చు మండల గౌరవ అధ్యక్షులు మెస్రం నాగ్నాథ్ ,ఆదివాసీ విద్యార్థిసంఘం పెందోర్ సురెంధర్ ,కోట్నాక్ శంతోష్ , కత్లె పృథ్వీరాజ్ ,మెస్రం దినేష్ ,కోరెత రాజెందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!