epaper
Friday, January 23, 2026

1.4 లక్షల మొబైల్ నంబర్లు బ్లాక్..

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

కేంద్రం కీలక నిర్ణయం.. 1.4 లక్షల మొబైల్ నంబర్లు బ్లాక్.. 500 మంది అరెస్ట్‌..

ఈ మధ్య కాలంలో మోసాలు పెరిగిపోతున్నాయి. మొబైల్‌ల ద్వారా కాల్స్‌ చేస్తూ అమాయకులను మోసగిస్తున్నారు.

ఒకరి పేరుపై ఎన్నో సిమ్‌ కార్డులను తీసుకుని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్రం ఇలాంటి వాటిపై నిఘా పెట్టింది. డిజిటల్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 1.4 లక్షల మొబైల్ నంబర్లను బ్లాక్ చేసింది.

అధికారిక నివేదికలు విడుదల ప్రకారం ఈ మొబైల్ నంబర్లు ఆర్థిక మోసంతో ముడిపడి ఉన్నాయి.

ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్ జోషి అధ్యక్షతన ఆర్థిక సేవల రంగంలో సైబర్ భద్రతపై సమావేశం జరిగింది.

ఇది అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (API) ఇంటిగ్రేషన్ ద్వారా సివిల్ ఫైనాన్షియల్ సైబర్, సైబర్ ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CFCFRMS) ప్లాట్‌ఫారమ్‌పై బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఆన్‌బోర్డింగ్‌తో సహా వివిధ సమస్యలను చర్చించింది.

CFCFRMS ప్లాట్‌ఫారమ్ నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ (NCRP)తో అనుసంధానించబడుతుంది. దీనివల్ల పోలీసులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల మధ్య మెరుగైన సమన్వయం సాధ్యమవుతుంది. మల్టిపుల్ ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్న 35 లక్షల ప్రైమరీ యూనిట్‌లను టెలికమ్యూనికేషన్స్ విభాగం విశ్లేషించిందని ప్రకటన పేర్కొంది. వీటిలో హానికరమైన SMS పంపిన 19,776 సంస్థలు బ్లాక్ లిస్ట్ చేసింది. ఈ విషయంలో 500 మందికి పైగా అరెస్టులు చేశారు. అలాగే సుమారు 3.08 లక్షల సిమ్‌లు బ్లాక్ చేసింది కేంద్రం. దేశంలో సైబర్ మోసాల కేసులు వేగంగా పెరుగుతున్నాయని, ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు మొబైల్ ఫోన్‌ల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని గుర్తించింది.

సైబర్ మోసాలను నివారించడానికి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. SMS, ఇమెయిల్‌లోని ఏదైనా తెలియని లింక్‌పై ఎప్పుడూ క్లిక్ చేయవద్దు. మీ బ్యాంక్ ఖాతాతో అనుబంధించబడిన రహస్య సమాచారాన్ని ఎవ్వరికి అందించవద్దు. అనుమానాస్పద కాల్‌లు, సందేశాలు లేదా మెయిల్‌లకు సమాధానం ఇవ్వవద్దు. వాటిని వెంటనే బ్లాక్ చేయండి. అయితే ఇటీవల కాలంలో బ్యాంకు ఖాతాదారుల విషయంలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి మోసాల నుంచి రక్షించుకోవడానికి వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని బ్యాంకులు పదేపదే హెచ్చరిస్తున్నాయి. అలాగే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా ఎప్పటికప్పుడు బ్యాంకు కస్టమర్లను అప్రతమతం చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తోంది. వినియోగదారులకు వివిధ ఆఫర్లు, బ్యాంకు ఏటీఎం బ్లాక్‌ అవుతుందనో, లేక కేవైసీ పేరుతో ఇలా రకరకాల లింక్స్‌లను పంపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. వినియోగదారులు వాటిని నమ్మి ఆ లింక్‌లపై క్లిక్‌ చేయగానే వారి వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకుకు సంబంధించిన వివరాలు చేరిపోతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!