epaper
Friday, January 23, 2026

పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక బాలిక ఆత్మహత్య

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్, రామకృష్ణాపూర్ (మార్చ్ 10) :  రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్ఆర్ నగర్ రోడ్ నెంబర్ 2 నివాసం ఉండే రిటైర్డ్ హెచ్ఎం గూడెపు కామేశ్వరరావు సునీత ల కూతురు శ్రీ వైష్ణవి ఆత్మహత్య చేసుకున్న సంగటన చోటుచేసుకుంది. ఎస్సై బి అశోక్ తెలిపిన వివరాల ప్రకారం గూడెపు కామేశ్వరరావు సునీత  లకు కుమారుడు పనింద్ర, కుతూరు శ్రీ వైష్ణవి( 17) ఉన్నారు.  కుమారుడు పనింద్ర ఎరోనాటికల్ ఇంజనీరింగ్ చదివి, ప్రస్తుతము ఇంటి వద్ద నుండి సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు. కూతురు శ్రీ వైష్ణవి సింగరేణి మహిళా జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ ఇంటి వద్ద నుండే ఆన్లైన్ క్లాసెస్ వింటూ చదువుతోంది. నీట్ కి ప్రిపేర్ అవుతూ ఇంటి వద్దనే ఉంది. గత కొద్ది రోజుల నుండి నీట్ కీ క్వాలిఫై అవుతానో కానో అని బాధపడుతూ ఉండేదని, అలా టెన్షన్ పడినప్పుడల్లా కుటుంబ సభ్యులు నచ్చ చెప్పేవారని తెలిపారు. గురువారం ఉదయం సుమారు 9 గంటలకు కామేశ్వర్ రావు అతని భార్య సునీత కలిసి చెన్నూర్ కు ఫంక్షన్ కు వెళ్లి తిరిగి సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చారు. రాత్రి 7:30 కు సమయంలో భోజనం చేసి చదువుకుంటానని చెప్పి శ్రీ వైష్ణవి తన గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్ కు చున్నితో ఊరేసుకోని వేలాడుతూ కనిపించింది. వెంటనే కొడుకు పనింద్రను పిలిచి చున్ని విప్పి కూతురును కిందికి దింపారు. వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగ,డాక్టర్ పరిశీలించి చనిపోయిందని చెప్పారు.వారి కూతురు మృతికి ఇంటర్ సెకండియర్ చదువుతూ నీట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ నీట్ వస్తుందో రాదో అని బాధపడుతూ గురువారం రోజున రాత్రి ఇంటిలో గదిలోని సీలింగ్ ఫ్యాన్ కు సునీత ఉరేసుకొని చనిపోయిందని మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని ఎస్సై బి అశోక్ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!