మేడ్చల్ జిల్లా :
మేడ్చల్ జిల్లా సూరారంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపుతోంది.
శివాలయం వద్దనున్న ఖాళీ స్థలంలో కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృత దేహాన్ని ఆదివారం ఉదయం స్థానికులు గుర్తించారు.
ఆదివారం భోగి పండుగ సందర్బంగా ఆలయానికి వచ్చిన భక్తులకు దుర్వాసన రావడంతో పరిసరాలను పరిశీలించగా మృతదేహం కనిపించింది.
స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Recent Comments