Wednesday, October 15, 2025

చిన్నారులను క్రూరంగా నరికి చంపిన కన్న తల్లి

హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారం ప్రాంతంలో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

కుటుంబ కలహాలతో మానసికంగా చితికిపోయిన ఓ తల్లి, తన ఇద్దరు చిన్నారులను క్రూరంగా వేట కొడవలితో నరికి, చంపింది,అనంతరం తాను బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ దారుణ ఘటన లో మృతిచెందిన తల్లి తేజస్విని రెడ్డిగా, ఆమె కుమారులు హర్షిత్ రెడ్డి, (7), ఆశిష్ రెడ్డి (5) గా పోలీసులు వెల్లడించారు.

Thank you for reading this post, don't forget to subscribe!

తేజస్విని తన చిన్న కొడుకు ఆశిష్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు, పోలీసులు రామ్రాజ్‌ అసుపత్రికి తరలించారు.

అయితే మార్గ మధ్యలోనే ఆశిష్‌ మృతి చెందాడు. అయితే.. హర్షిత్ రెడ్డి ఘటన స్థలంలోనే మృతి చెందాడు.తేజస్విని రెడ్డి, ఈ ఘటన కు ముందు ఆరుపేజీల సూసైడ్ నోట్ రాసి ఉంచింది. సూసైడ్ నోట్ లో ఆమె తన మనో వేదనను, కుటుంబపరమైన ఒత్తిడులను వివరించినట్టు సమాచారం.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలానికి బాలనగర్ డీసీపీ, జీడిమెట్ల సీఐలు చేరుకుని క్లూస్ టీమ్ తో పరిశీలనలు చేపట్టారు.

ఈ సంఘటన గాజులరామారంలో తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!