Wednesday, October 15, 2025

GP ELECTIONS 2024 : కొత్త పంచాయతీలు 223

హైదరాబాద్‌, ఆగస్టు 14 రాష్ట్రంలో కొత్తగా 223 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కొత్తగా 223 గ్రామ పంచాయతీలను చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ, మండలి బిల్లును ఆమోదించాయి.

ఆ బిల్లును అప్పటి గవర్నర్‌ తమిళిసై పెండింగ్‌లో పెట్టారు. గత గవర్నర్‌ ఆమోదం తెలపడంతో కొత్త పంచాయతీలపై ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పంచాయతీల ప్రకారం జీపీల్లో ఎన్నికలు జరగనున్నా యి. కొత్త పంచాయతీల స మాచారాన్ని పంచాయతీరాజ్‌శాఖ అధికారులు జిల్లాలకు చేరవేశారు.

ఇప్పటి వరకు 12,769 గ్రామ పంచాయతీలుండగా కొత్తగా 223 పంచాయతీలను ఏర్పాటు చేశారు. మొ త్తంగా 12,992 పంచాయతీలకు చేరా యి. వీటిలో ములుగు జిల్లా కేం ద్రాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గ్రామాల సంఖ్య 12,991కు చేరింది.

Thank you for reading this post, don't forget to subscribe!
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!