హైదరాబాద్ : జమ్మూ కాశ్మీర్లోని రాంభన్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ జవానుల తో వెళ్తున్న ఆర్మీ వాహనం 700 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న ఆర్మీ అధికారులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.దాదాపు 700 అడుగుల లోయలో ఈ ఆర్మీ వాహనం పడిపోయింది.
జమ్మూ నుంచి శ్రీనగర్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇక ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి. ఈ సహాయక చర్యల్లో ఆర్మీ అధికారులు, కాశ్మీర్ పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్తోపాటు స్థానిక వాలంటీర్లు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments