అమరావతి : వైసీపీ ముఖ్యనేతలతో సీఎం జగన్ అత్యవసరంగా సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ భేటీకి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి హాజరయ్యారు. సీఎం అనంతపురం పర్యటన, అధికారిక సమీక్షలు రద్దుతో పాటు మాజీ మంత్రి వివేకా హత్య కేసులో భాస్కర్రెడ్డి అరెస్ట్, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీ అవినాష్రెడ్డి సీబీఐ ముందు హాజరు కానుండటం తదితర పరిణామాల క్రమంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది? ఆ తర్వాత జరిగే పరిణామాలను ఎలా ఎదుర్కోవాలి? పార్టీ తరఫున ఎలా ముందుకెళ్లాలి? తదితర అంశాలపై నేతలతో జగన్ చర్చించినట్లు సమాచారం.
Thank you for reading this post, don't forget to subscribe!సీఎం జగన్ అత్యవసర సమావేశం…
Previous article
Next article
Recent Comments