రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : తాటి చెట్టుపై పిడుగు పడి మంటలు చెలరేగిన ఘటన శుక్రవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లాలో సంభవించింది. జిల్లాలోని తాంసీలో ఓ పొలంలోని తాటిచెట్టుపై పిడుగు పడి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా జిల్లాలో పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది.
Recent Comments