epaper
Saturday, January 24, 2026

రైతులను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్…..
• బిజెపి ని విమర్శిస్తే ఊరుకునేది లేదు

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

– గాజుల రాకేష్
BJYM బోథ్ అసెంబ్లీ IT కన్వీనర్

తెలంగాణ రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని, కాంగ్రెస్ నాయకులను రైతులు గ్రామాల్లో తిరగనివ్వొద్దని బిజెపి యువమోర్చా బోథ్ అసెంబ్లీ ఐటి, సోషల్ మీడియా కన్వీనర్ గాజుల రాకేష్ పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్రాంత రైతుల కష్టాన్ని కర్ణాటక రైతులకు కాంగ్రెస్ పార్టీ దోచిపెడుతుందని ధ్వజమెత్తారు.

తెలంగాణరాష్ట్రంలో క్వింటాలు పత్తి రేటు 7521 రూపాయలు ఉంటే, కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాష్ట్రంలో 8972 రూపాయలు ఉందని దీని ఆంతర్యం ఏంటని అన్నారు.

కర్ణాటకలో, తెలంగాణలో పాలించేది కాంగ్రెస్ ప్రభుత్వమే అయినా కొనుగోళ్లలో వ్యత్యాసం ఎందుకు ఉందని, దాని వెనక ఉన్న ఉద్దేశ్యం ఏంటని ప్రశ్నించారు.

దేశ వ్యాప్తంగా పత్తికి ఒకే రేటు ఉన్నప్పటికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధరను పెంచి రైతులకు లాభం చెకురిస్తే తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా ఉందని, తెలంగాణ లో కొనుగోలు చేసిన పత్తిని కర్ణాటకలో అధిక రేటుకు అమ్ముకుని కాంగ్రెస్ నాయకులు సొమ్ము చేస్కుంటున్నారేమో నన్న అనుమానం కలుగుతుందని అన్నారు.

మద్దతు ధర ను పెంచి రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తుందని విమర్శించారు.

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతంగానిపై చిత్త శుద్ధి ఉంటే కర్ణాటక లో మాదిరిగా క్వింటాలుకు 8972 రూపాయలకు కొనుగులు చేసి పత్తి రైతులకు అండగా ఉండాలని లేదంటే కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు.

కొందరు చోటా మోటా కాంగ్రెస్ నాయకులు అవగాహన లేకుండా బిజెపి పై విమర్శలు చేస్తున్నారని వారికి చిత్త శుద్ధి ఉంటే ముఖ్యమంత్రి తో మాట్లాడి రైతులకు న్యాయం చేయాలని సూచించారు.
కల్పిత కథనాలతో, అవగాహన రాహిత్యంతో బిజెపి ని విమర్శిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!